నెల రోజుల పాటు మెగా అభిమానులకు పండగే!

by Disha Web Desk 9 |
నెల రోజుల పాటు మెగా అభిమానులకు పండగే!
X

దిశ, వెబ్‌డెస్క్: 30 రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగు సినిమాలతో అభిమానులకు కిక్కిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు మెగా హీరోలు. జులై 28 నుంచి మొదలు పెడితే ఆగస్టు 25వ తారీకు వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. కాగా, ముందుగా జులై 28న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘బ్రో’ చిత్రం విడుదల కానుంది. ఇందులో పవన్ దేవుడిగా కనిపించబోతున్నారు. సాయితేజ్ భక్తుడి పాత్రలో నటించనున్నాడు.

తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యాక వారం రోజుల గ్యాప్‌లోనే ఆగస్టు 18న మరో మెగా హీరో ‘వైష్ణవ్ తేజ్’ నటిస్తోన్న ‘ఆది కేశవ’ రానుంది. దీంతో పాటు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ‘గాండీవ దారి అర్జున’ ఆగస్టు 25న విడుదల కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రతీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పవర్ స్టార్ ‘BRO’ సాంగ్

Next Story

Most Viewed