Megastar Chiranjeevi పై అభిమాని విషప్రయోగం.. బయట పెట్టిన చిరు

by Disha Web Desk 7 |
Megastar Chiranjeevi పై అభిమాని విషప్రయోగం.. బయట పెట్టిన చిరు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ తన లైఫ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు.

1988లో చిరంజీవి నటించిన ''మరణ మృదంగం'' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనపై విషప్రయోగం జరిగిందని తెలిపారు. షూటింగ్ సమయంలో కొంత మంది ఫ్యాన్స్ తనతో కేక్ కట్ చేయించారు. అయితే అందులో ఓ అభిమాని కేక్ ముక్క తినిపించగా అది కాస్త చేదుగా ఉండటంతో డౌట్ వచ్చి ల్యాబ్‌కు పంపిస్తే అందులో విషపూరితమైన పౌడర్ కలిసిందని రిపోర్ట్‌లో తేలింది. వెంటనే నిర్మాత కేఎస్ రామరావు ఆ కేక్ తినిపించిన వ్యక్తిని కొట్టి.. ఎందుకు ఇలా చేశావు అని అడిగారు. అప్పుడు ఆ అభిమాని చిరంజీవి నాతో ఈ మధ్య సరిగ్గా మాట్లాడటం లేదు.. ఆయన వేరే వాళ్లకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదు. ఆయనకు దగ్గరవ్వాలని వశీకరణ మందు కలిపాను అని వ్యక్తి చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ వ్యక్తిది అభిమానం అనుకోవాలో, మూర్ఖత్వం అనుకోవాలో తెలియక అతడిని వదిలి పెట్టినట్లు చెప్పుకొచ్చారు చిరంజీవి. కాగా.. చిరంజీవి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read...

ఆర్‌ఆర్‌ఆర్‌కు జగన్ ప్రశంస.. అద్నాన్ సమీ వివాదాస్పద ట్వీట్



Next Story

Most Viewed