పవన్ కల్యాణ్‌ మీద క్రిమినల్ కేసు పెట్టాలి.. ఆర్జీవీ సంచలన ట్వీట్

by Disha Web Desk 4 |
పవన్ కల్యాణ్‌ మీద క్రిమినల్ కేసు పెట్టాలి.. ఆర్జీవీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ మీద క్రిమినల్ కేసు పెట్టాలంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్ చేశారు. అయితే వారాహి రెండో విడత యాత్రలో భాగంగా ఆదివారం జనసేన చీఫ్ వైసీపీ ప్రభుత్వం, వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి? ఏ ఫ్యామిలో ఎంత మంది ఉన్నారు? అమ్మాయిలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా? వితంతవులు ఉన్నారా లేదా అనే వివరాల్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని పవన్ ఆరోపించారు. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆర్జీవీ తనదైన స్టైల్‌లో ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘వైసీపీ ప్రభుత్వం మహిళల ట్రాఫికింగ్ చేస్తోంది అనే పవన్ కల్యాణ్ ఆరోపణ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ ఎవరి మీద చేసిన ఆరోపణలక్నింటికీ పరాకాష్ట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ల దగ్గర ఈ విషయం మీద ఆధారాలు ఉంటే యాక్షన్ తీసుకోకుండా పీకే చెవిలో ఎందుకు చెప్పారు??’ అని ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ‘ప్రజల కోసం పని చేసే వైసీపీ వాలంటీర్లని పవన్ కల్యాణ్ అమ్మాయిల బ్రోకర్లు అన్నాడు. అంత నీచాతి నీచంగా అసహ్యంగా వర్ణించబడ్డ ఆ వాలంటీర్లకి సిగ్గు, శరం, ఆత్మాభిమానం ఉంటే వెంటనే వాళ్లు పవన్ కల్యాణ్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.. పెట్టకపోతే వాళ్ల ఇంట్లో ఫ్యామిలీలకి మొహాలెలా చూపెట్టగలరు?’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Also Read: ఈ వారం థియేటర్, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

Next Story

Most Viewed