సినీ చరిత్రలోనే కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేస్తుంది.. తారక్-ప్రశాంత్ కాంబోపై మేకర్స్

by Disha Web Desk 10 |
సినీ చరిత్రలోనే కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేస్తుంది.. తారక్-ప్రశాంత్ కాంబోపై మేకర్స్
X

దిశ, సినిమా: ఎట్టకేలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోకు సంబంధించి బిగ్ అప్ డేట్ వెలువడింది. ఎంతో కాలంగా వీరిద్దరి కలయికలో మూవీ రాబోతుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలసిందే. కాగా తాజాగా అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ‘ఎంతోమంది అతృతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ @tarak9999 & #PrashanthNeel. ఈ ప్రతిష్టాత్మకమైన మూవీ భారతీయ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుంది. ఏప్రిల్ 2024లో షూటింగ్ ప్రారంభమవుతుంది’ అంటూ మైత్రీ మూవీమేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తారక్, ‘కేజీఎఫ్‌’ సిరీస్‌తో ప్రశాంత్‌నీల్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ పాపులారిటీ దక్కించుకోగా సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక మైత్రీమూవీమేకర్స్‌, ఎన్టీయార్‌ ఆర్ట్స్‌ కలిసి సినిమా నిర్మించనున్నారు.

Read More..

ప్రభాస్ ‘సలార్‌’పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్‌.. సినిమా హిట్టా.. ఫట్టా?

Next Story

Most Viewed