టాలీవుడ్‌లో తెరకెక్కించిన 5 ఎక్స్‌పెన్సివ్ సాంగ్స్ ఇవే

by Anjali |
టాలీవుడ్‌లో తెరకెక్కించిన 5 ఎక్స్‌పెన్సివ్ సాంగ్స్ ఇవే
X

దిశ, సినిమా: ఒక సినిమాకు కథ ఎంత కీలకమో పాటలు కూడా అంతే ముఖ్యం. అందుకే దేశాలు, ఖండాలు దాటి పాటలను చిత్రీకరిస్తుంటారు మేకర్స్. మరి టాలీవుడ్‌లో తెరకెక్కించిన 5 ఎక్స్‌పెన్సివ్ సాంగ్స్ ఏవో చూద్దాం.

1. ప్రభాస్- రాజమౌళి కాంబోలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాలోని ‘సాహోరే బాహుబలి’ టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే అత్యధికంగా ఖర్చు చేసిన పాట. కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్‌లో వందల మంది డ్యాన్సర్‌లు పాల్గొనగా కేవలం ఈ పాట కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేశారట నిర్మాతలు.

2. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలోని ‘వచ్చాడయ్యో సామి’ సాంగ్ కోసం రూ.2.5 కోట్లు పెట్టారట మేకర్స్.

3. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’ మూవీలోని ‘రంగమ్మ మంగమ్మ’ పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా దీనికోసం రూ.2 కోట్లు అయిందట.

4. అల్లు అర్జున్ మూవీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లోని ‘ఇరగ ఇరగ’ పాట కోసం రూ.1.5 కోట్లు ఖర్చు చేశారట.

5. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’లోని సూపర్ హిట్ సాంగ్ ‘రాములో రాములా’ సెట్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా రూ.1.2 కోట్లు పెట్టారట.

చివరగా రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ లోని ఒక పాట కోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నాడట దర్శకుడు శంకర్. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Next Story