గుడ్‌ న్యూస్ : ఉద్యమకారులపై కేసులు కొట్టివేత.. ఖుషీలో విప్ బాల్కసుమన్

by  |
గుడ్‌ న్యూస్ : ఉద్యమకారులపై కేసులు కొట్టివేత.. ఖుషీలో విప్ బాల్కసుమన్
X

దిశ, చెన్నూర్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాటాలు చేసిన సందర్భంగా అప్పటి ఉస్మానియా విద్యార్థి నేతలు.. ప్రస్తుత ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, రాజారాం యాదవ్ పైన ఉన్న కేసులను నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు కొట్టి వేసింది. కేసును వాదిస్తున్న న్యాయవాదుల్లో ఒకరైన జక్కుల లక్ష్మణ్ కథనం ప్రకారం.. 2009 లాలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తార్నాకలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు బాల్క సుమన్, రాజారాం యాదవ్ తదితరులు తెలంగాణ బంద్ సందర్బంగా నినాదాలు చేస్తూ పెట్రోల్ బంకులో అద్దాలు పగులగొట్టారని లాలగూడ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును విచారించిన ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి కె.విజయ్ కుమార్ ఉద్యమ సమయం నాటి కేసులను కొట్టి వేసినట్టు తెలిపారు.

టీఆర్ఎస్ సోషల్ మీడియా స్ట్రైక్.. గొప్పలు డప్పు కొట్టినా ఫలితం లేదంటూ.


Next Story

Most Viewed