కరోనా వచ్చినా సరే.. హీరోయిన్ మోటివేషనల్ వీడియో

by  |
కరోనా వచ్చినా సరే.. హీరోయిన్ మోటివేషనల్ వీడియో
X

దిశ, సినిమా : ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ హీరోయిన్ ఈషా కొప్పికర్.. సోషల్ మీడియాలో మోటివేషనల్ వీడియో షేర్ చేసింది. కరోనా టైమ్‌లో ఈ వీడియో ద్వారా పాజిటివిటీని స్ప్రెడ్ చేసేందుకు ట్రై చేసింది. గతంలో తన నానమ్మకు హిప్ ఫ్రాక్చర్ అయిందని, తను మళ్లీ నడవగలనా లేదా? అనే ఆలోచనతో నిద్రకూడా పోయేది కాదని చెప్పింది. తన తండ్రి డాక్టర్ కావడంతో నిద్రపోయేందుకు మాత్రలు అడిగిందని, వెంటనే వరల్డ్‌లోనే బెస్ట్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అంటూ నాన్న మాత్రలు ఇచ్చాడని చెప్పింది. అవి వేసుకున్నాక తను కూడా హాయిగా పడుకుందని తెలిపింది. అయితే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా అని ప్రశ్నిస్తే.. తాను విటమిన్ ట్యాబ్లెట్స్ మాత్రమే ఇచ్చినట్టు చెప్పాడని ఈషా తన వీడియోలో వివరించింది. నానమ్మ కేవలం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అనే నమ్మకంతో మాత్రమే నిద్రపోయిందని, తన మైండ్‌కు అదే విధంగా సమాధానం చెప్పుకుందని తెలిపింది. అంటే మన మైండ్‌ను ఎలా సెట్ చేసుకుంటే మన జీవితం కూడా అలాగే ఉంటుందని వివరించింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కరోనా గురించి భయపడకుండా.. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించింది. ఒకవేళ కొవిడ్ వచ్చినా సరే బయటపడగలను అనే పూర్తి విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా జయిస్తామని తెలిపింది. మన మనసులో ఏదైతో నమ్ముతామో అదే కార్యరూపం దాల్చుతుందన్న ఈషా.. అందుకే మన పెద్దలు చెడు ఆలోచనలు, చెడు పనులకు దూరంగా ఉండాలని సూచిస్తారని చెప్పింది. మైండ్ అనేది అద్భుతమైన టూల్ అని.. సానుకూల ఆలోచనలతో సాగితే అద్భుతాలు చేస్తుందని తెలిపింది. భయం అత్యంత ప్రమాదకరమైనదని, దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచించింది.

Next Story

Most Viewed