తల్లి, కొడుకులు అదృశ్యం..

by  |
తల్లి, కొడుకులు అదృశ్యం..
X

దిశ,బోథ్ : ఇచ్చోడలోని సుభాష్ నగర్ కాలనీలో నివాసముంటున్న జాధవ్ సునీత, ఆమెకు చెందిన ఇద్దరు కుమారులు జాధవ్ సాయి కుమార్, జాధవ్ శివ ప్రసాద్ అదృశ్యమైనట్లు ఎస్ఐ ఫరీద్ తెలిపారు. ఈ నెల 10 న అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నాపూర్ గ్రామంలోని పూలాజీ బాబా గుడికి పూజ కోసం వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేరు. సునీత తండ్రి రాథోడ్ దూధీరామ్ బంధువులు, సన్నిహితులకు సమాచారం ఇచ్చిన ఆచూకీ లభించలేదు. బుధవారం సాయంత్రం ఇచ్చోడ పోలీస్ స్టెషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ఫరీద్ తెలిపారు. ఎవరికైనా కనిపిస్తే 9440795015, 9849658648, 8333986929 సెల్ నంబర్లకు సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.


Next Story