కన్నతల్లే హంతకురాలు.. దానికి అలవాటు పడి తమ పిల్లలతో భిక్షాటన చేయిస్తూ..!

by  |
కన్నతల్లే హంతకురాలు.. దానికి అలవాటు పడి తమ పిల్లలతో భిక్షాటన చేయిస్తూ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : పంజాగుట్టలో వెలుగుచూసిన చిన్నారి హత్య కేసును ఎట్టకేలకు స్థానిక పోలీసులు శనివారం ఛేదించారు. ఈ మర్డర్ చేసింది కన్నతల్లే అని నిర్దారణకు వచ్చారు. ఓల్డ్ సిటీకి చెందిన ఖాదర్ అనే వ్యక్తితో కలిసి కూతురిని హత్య చేసినట్టు తల్లి హీనా బేగం విచారణలో అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.

మద్యానికి బానిస అయిన హీనా తన పిల్లలను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మేజర్ నగరాల్లో భిక్షాటన చేయిస్తున్నట్టు విచారణలో తేలింది. చిన్న కూతురిని కూడా భిక్షాటన చేయాలని చెప్పడంతో అందుకు ఆమె నిరాకరించడంతో ఖాదర్‌తో కలిసి కూతురును నేలకేసి కొట్టినట్టు నిందితురాలు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story