తల్లీ కూతుళ్లు ఆత్మహత్య

by  |
తల్లీ కూతుళ్లు ఆత్మహత్య
X

దిశ, మెదక్: కుటుంబ కలహాలతో చెరువులో దూకి తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ పట్టణంలోని కుమ్మరి గడ్డకు చెందిన చిలుకూరి అనూషకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రిత్విక(4), చిన్న కూతురు ప్రణవి(17 నెలలు). గత వారం భర్త రవితో ఆమెకు గొడవ జరిగింది. దీంతో అనూష తన చిన్న కూతురు ప్రణవితో కలిసి ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది.

తన కూతురు, మనవరాలు కనపడడం లేదని అనూష తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పిట్లం చెరువులో తల్లీ, కూతుళ్ల మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు సోమవారం సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లి మృతదేహాలను పోలీసులు వెలికి తీయించారు. పట్టణ సీఐ వెంకట్ కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు.

Next Story