ముగ్గురు ఆడపిల్లలకు ఉరేసిన తల్లి.. చివరకు..

by  |
ముగ్గురు ఆడపిల్లలకు ఉరేసిన తల్లి.. చివరకు..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అసలే పేద కుటుంబం. పైగా ముగ్గురు ఆడపిల్లలు. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి. ఏ రోజు పనికెళ్తే ఆ రోజే పిల్లలకు తిండి దొరుకుతుంది. లేకుంటే పస్తులు ఉండడం పరిపాటే. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అండగా నిలవాల్సిన భర్త తాగుడుకు బానిసయ్యాడు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు భర్త తాగుడుకు బానిస కావడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎటుచూసినా ఆమెకు ఒంటరితనం.. శూన్యమే కనిపించింది. దీంతో తన ముగ్గురు ఆడపిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన తోరుపునూరి వెంకటేశ్, ఉమారాణి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు హర్షిణి(13), లక్కీ(11), శైని(8)). దినసరి కూలీ చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటుంది. ఈ క్రమంలో భర్త వెంకటేశ్ తాగుడుకు బానిసగా మారి పని మానేయడంతో ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పిల్లల పోషణ భారంగా మారింది. దీంతో ఉమారాణి(31) తన ముగ్గురు పిల్లలకు మూడు పూటల తిండి పెట్టలేకపోతున్నాననే మనోవేదనతో చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సమయంలో తన చీరతో ముగ్గురు ఆడపిల్లలకు ఉరేసి తాను వేసుకుంది. కానీ, చిన్న కూతురు శైని(8) మెడకు బిగించిన చీర ముడి ఊడిపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన స్థానికులను కలచి వేసింది.


Next Story

Most Viewed