ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

by  |
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా కొండపల్లిలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మృతులు: లావణ్య, దుర్గా శ్రీవల్లి, హనీశ్‌కుమార్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా లేకుంటే ఆర్థిక ఇబ్బందులున్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.


Next Story

Most Viewed