దారుణం: కొడుకు ప్రేమించిన యువతిని ఇంటికి పిలిచి ఆమెపై అలా..

by  |
jagityala crime
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో పరువు హత్యలు ఎక్కువయిపోతున్నాయి. కులం కానీ వారిని ప్రేమించి తమ పరువు తీశారని కన్న బిడ్డల్నే తల్లిదండ్రులు హతమారుస్తున్నారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించిన వారిని కడతేరుస్తున్నారు. తాజాగా ఒక తల్లి తన కొడుకు వేరే అమ్మాయితో పారిపోయాడని తెలిసి, వారిద్దరికీ పెళ్లి చేస్తానని నమ్మించి, ఇంటికి తీసుకొచ్చి కొడుకు ప్రేమించిన యువతిపై దాడికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. అరవింద్‌ నగర్‌కు చెందిన సాప భరత్‌చంద్ర(26), మోచీబజార్‌కు చెందిన బోగని శ్రావణి(21) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రావణి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించగా ఆమె అన్నవదినల వద్ద ఉంటూ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. భరత్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఇటీవలే భరత్ కి వేరే యువతితో అతని తల్లిదండ్రులు నిశ్చితార్థం జరిపించారు. ఈ నెల 27 న పెళ్ళికి ఏర్పాట్లు కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న భరత్, శ్రావణి ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.

కొద్దిరోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా శనివారం ఫోన్ కలిసింది. ప్రేమించిన యువతితోనే వివాహం జరిపిస్తామని నమ్మించి వారిని ఇంటికి రప్పించారు. ఇంటికి వచ్చాకా, శ్రావణితో తన కుమారుడి పెళ్లి చేయడం ఇష్టంలేని తల్లి అరుణ ఇనుపరాడ్‌తో శ్రావణి తలపై దాడిచేసింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న శ్రావణి అరుచుకుంటూ బయటకు పరిగెట్టడంతో చుట్టూ పక్కల వారు చూసి ఆమెను హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం శ్రావణి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed