కరెంట్ షాక్ తగిలి.. బావిలో పడి!

by  |
కరెంట్ షాక్ తగిలి.. బావిలో పడి!
X

దిశ, జగిత్యాల : బోరు మోటర్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవాశాత్తు కరెంట్ షాక్ తగిలి తల్లీకొడుకు బావిలోపడి చనిపోయారు. ఈ ఘటన జాగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఓడ్డే లింగాపూర్ గ్రామ పరిధిలోని మంతెననాయక్ తండాలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన పాల్తే జమున(32), కొడుకు పాల్తే జ్ఞానేశ్వర్‌(14) భూపతిపూర్ గ్రామ శివారులోని రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు చేస్తున్నారు. ఆ బావి వద్ద ఉన్న బోరు మోటర్‌కు గురువారం కొడుకుతో కలిసి తల్లి విద్యుత్‌ మరమ్మతులు చేస్తున్నది. ఈ క్రమంలో జమునకు కరెంట్ షాక్ తగిలింది.

దీనిని గమనించిన కొడుకు ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తుండగా అతనికీ కరెంట్ షాక్ తగిలింది. దీంతో వారు పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. నీటిలో మునిగి ఇద్దరూ చనిపోయారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్ల సహాయంతో రెండు మృతదేహాలను బయటికి తీశారు. తల్లీకొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికల్ ఎస్ఐ ఆరోగ్యం తెలిపారు.

Next Story

Most Viewed