- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తల్లీకొడుకుల మృతి నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. మృతి చెందిన రెండు రోజుల తరువాత విషయం బయటపడడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో అనసూయమ్మ (70), ఆమె కుమారుడు గోపాల్రెడ్డి (45) నివసిస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటకు రావడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రెండు రోజులుగా వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తోంది. అది పెరుగుతుండడంతో స్గానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరూ మృతి చెంది కనిపించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.
Tags: mother and son dead, nellore district, ap, gangavaram
Next Story