అర్ధరాత్రి తల్లీకూతుళ్ల ఆత్మహత్య..

by  |
అర్ధరాత్రి తల్లీకూతుళ్ల ఆత్మహత్య..
X

దిశ, సిరిసిల్ల : అనారోగ్యంతో బాధపడుతూ అర్ధరాత్రి తల్లీకూతుళ్లు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటలో చోటుచేసుకుంది. నాగంపేటలో ఉంటున్న ఫాతిమా(70), హజీజా(45) తల్లీ కూతుళ్లు. ఫాతిమా భర్త గతంలోనే చనిపోగా, కూతురు హజీజా, అల్లుడు లాల్ మహమ్మద్‌లతో కలిసి ఉంటుంది.

కాగా, తల్లీకూతుళ్లు ఇద్దరు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సకు సరిపడా డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి లాల్ మహమ్మద్ నిద్రిస్తున్న సమయంలో పక్కగదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed