- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిరిసిల్ల : అనారోగ్యంతో బాధపడుతూ అర్ధరాత్రి తల్లీకూతుళ్లు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటలో చోటుచేసుకుంది. నాగంపేటలో ఉంటున్న ఫాతిమా(70), హజీజా(45) తల్లీ కూతుళ్లు. ఫాతిమా భర్త గతంలోనే చనిపోగా, కూతురు హజీజా, అల్లుడు లాల్ మహమ్మద్లతో కలిసి ఉంటుంది.
కాగా, తల్లీకూతుళ్లు ఇద్దరు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సకు సరిపడా డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి లాల్ మహమ్మద్ నిద్రిస్తున్న సమయంలో పక్కగదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story