విగతజీవులుగా మారిన తల్లీకూతుళ్లు.. ఆ రాత్రి ఏం జరిగింది..?

by  |
murder-adilabad 1
X

దిశ, మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టణంలోని బృందావన్ కాలనీలో తల్లీకూతుళ్ళు దారుణహత్యకు గురయ్యారు. పట్టణంలోని బృందావన్ కాలనీలో నివాసముండే పూదరి విజయలక్ష్మి(47), ఆమె కూతురు రవీనాను(23) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈరోజు ఉదయం పనిమనిషి వచ్చి ఎంత పిలిచిన తలుపులు తీయకపోవడంతో పక్కన ఉండే వారికి చెప్పడంతో వారు వచ్చి చూసేసరికి తల్లికూతుళ్ళు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు.

రవీనాకు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన అరుణ్ కుమార్‌తో గతేడాది ప్రేమవివాహం జరగగా వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తుండగా గురువారం విచారణకు వెళ్లివచ్చారు. అనంతరం అరుణ్ కుమార్ కూడా ఇంటికి వచ్చి వారితో గొడవ పడ్డాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెల్లవారే సరికి తల్లీకూతుళ్లు హత్యకు గురవడంతో అరుణ్ కుమార్ ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు క్లూస్ టీం, పోలీస్ జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్ వచ్చి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed