తల్లీకూతురు మరణానికి కారణం ఏంటో..?

by  |
suicide
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో గుర్తుతెలియని తల్లి, కుమార్తె గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి కూతురు గోదావరిలో దూకడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపే ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు.. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వారి ఆత్మహత్య గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Next Story