అధిక జనాభా వల్ల ఎక్కువ కరోనా కేసులు

by  |
అధిక జనాభా వల్ల ఎక్కువ కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సమస్యకు ఇప్పుడిప్పుడే పరిష్కారం లభించే సూచనలు లేవని, అధిక జనాభా వల్ల దేశంలోనూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ వర్గాలతో చంద్రబాబు గురువారం ఉదయం వెబినార్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పేదల తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఈ సమస్యను అధిగమించడం పెద్ద సవాల్ అని తెలిపారు.



Next Story

Most Viewed