ఏపీలో ఒక్కరోజే 10వేలకు పైగా కేసులు

by  |
ఏపీలో ఒక్కరోజే 10వేలకు పైగా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ నమోదైన కేసులు ఆల్ ‌టైమ్ రికార్డుగా మారాయి. గడిచిన 24గంటల్లోనే 10,093 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంకేసుల సంఖ్య లక్షా 20వేల 390కి చేరింది. ఇవాళ కరోనా బారిన పడి 65మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,213కు చేరింది.

గడిచిన 24గంటల్లో 70,584మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 63,771 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స తీసుకొని 55,406 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 2,784 మంది కోలుకొని డిశార్జ్ అయ్యారు. బుధవారం కరోనా బారిన పడి తూర్పుగోదావరి జిల్లాలో 14మంది చనిపోగా అనంతపురం 8, విజయనగరం 7, చిత్తూరు 6, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, ప్రకాశం 4, గుంటూరు 3, కడప 3, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 18, 20,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed