వర్షాకాలం ముందే ప్రవహించిన మూసీ

by  |
వర్షాకాలం ముందే ప్రవహించిన మూసీ
X

దిశ, చేవెళ్ల : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి మూసీ వాగు ప్రవహించడంతో మోకిలా టంగుటూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ అనంతగిరి నుంచి ప్రారంభమయ్యే మూసీ వాగు వికారాబాద్ నవాబ్ పేట్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు గురువారం ఉదయం నుంచి నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు అంతరాయం కలిగింది. టంగుటూరు మోకిల మధ్య తాత్కాలికంగా రాకపోకల కోసం వాగులో మట్టితో కూడిన రోడ్డును గ్రామస్థులే ఏర్పాటు చేసుకున్నారు. వేసవి కాలంలో టంగుటూరు గ్రామస్థులు తాము పండించిన కూరగాయలు ఇదే వాగు లోంచి ఆటోల్లో, మోటార్ సైకిళ్ళపై నగరానికి వెళ్ళేవారు. అది కాస్త వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Next Story

Most Viewed