అయ్యో రామా…6లక్షలు మాయం….

by  |
అయ్యో రామా…6లక్షలు మాయం….
X

దిశ వెబ్ డెస్క్:
రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర‌కు సంబంధించిన అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యాయి. క్లోనింగ్ చేసిన చెక్కులతో రూ.6లక్షలను దుండగులు విత్ డ్రా చేశారు. దీంతో పోలీసుల‌కు ట్ర‌స్టు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సంప‌త్ రాయ్ బుధ‌వారం ఫిర్యాదు చేశారు. కాగా నయాఘాట్ లోని ఎస్బీఐ బ్రాంచి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయ్యాయి. చెక్కులపై సంపత్ రాయ్ తో పాటు అనిల్ మిశ్ర సంతకాలు ఉన్నాయి. అయితే డబ్బులను సెప్టెంబర్ 1,8 తేదీల్లో పీఎన్ బీ బ్యాంక్ కు ట్రాన్స్ ఫర్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story