కొత్త ఆసుపత్రులకు నో మనీ

by  |
కొత్త ఆసుపత్రులకు నో మనీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించాలనుకుంటున్న ఆసుపత్రులకు కాసుల కష్టం ఏర్పడింది. కొత్త ప్రాజెక్టులోని 70 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనులు పెండింగ్​ పడ్డాయి. వీటి నిర్మాణాలు, మౌలిక వసతులు, మ్యాన్​పవర్​ను సమకూర్చేందుకు సుమారు 180 కోట్లు అవసరం అవుతాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని వైద్యశాఖ ప్రభుత్వాన్ని కోరింది. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతోనే ఆసుపత్రుల నిర్మాణ పనులు మందగించినట్లు స్పష్టం చేశారు. దీంతో పాటు సిబ్బంది కొరత ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో పనిచేసేందుకు అన్ని విభాగాలు కలిపి 14,568 మంది అవసరం ఉండగా, ప్రస్తుతం 13,763 మంది మాత్రమే లభించినట్లు ఆఫీసర్లు వివరించారు. మరో 4,130 నియమించాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకొచ్చారు. అయితే వీరిలో ప్రస్తుతానికి 3,325 మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేదని, కేవలం 805తో పాటు డీఎంహెచ్ఓ, డీపీహెచ్​ఓ కార్యాలయాల్లో మరో 175 మందిని మాత్రం నియమిస్తే సరిపోతుందని సర్కార్ వైద్యశాఖకు సూచించినట్లు తెలిసింది.

epaper – MORNING EDITION (22-11-21) చదవండి


Next Story

Most Viewed