బ్రేకింగ్ న్యూస్.. సింగరేణి కార్మికులకు ‘డబుల్’ బోనాంజ..

by  |
బ్రేకింగ్ న్యూస్.. సింగరేణి కార్మికులకు ‘డబుల్’ బోనాంజ..
X

దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికులకు మరో గుడ్ న్యూస్. లాభాల వాటాకు సంబంధించిన దసరా అడ్వాన్స్‌ను ప్రతీ కార్మికుడికి 25 వేల రూపాయలను ఈనెల 8వ తేదీన వారి ఖాతాల్లోకి జమ చేసేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. సింగరేణి లాభాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 29 శాతం లాభాలను 46 వేల మంది కార్మికులకు అందించేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది.

కేసీఆర్ ఆదేశాలతో దసరాకు ముందే కార్మికులకు.. సింగరేణి యాజమాన్యం ఈ అడ్వాన్స్‌లను చెల్లించనున్నట్లు పేర్కొంది. అలాగే దీపావళి బోనస్‌ను నవంబర్ 1వ తేదీన కార్మికులకు చెల్లించనున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.

Next Story