జీపీ వర్కర్లకు అరుదైన గౌరవం

by  |
జీపీ వర్కర్లకు అరుదైన గౌరవం
X

దిశ, కరీంనగర్: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పారిశుధ్య కార్మికులు నిరంతరం విధులకు హాజరవుతూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించిన సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న కూతురు సోనికా రెడ్డి నోట్ల దండలతో వారిని ఘనంగా సత్కరించారు. పరిశుభ్రమైన వాతావరణం లేకపోతే మరిన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వెల్లడించారు. జీపీ కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. విపత్కర పరిస్థితుల్లో జీపీ కార్మికులు లేకపోతే మరికొంత మంది రోగాల బారిన పడి ఉండేవారని సోనికారెడ్డి వివరించారు.

tags ; corona, lockdown, money garland, gp workers, karimnagar

Next Story

Most Viewed