హెరిటేజ్ నాదే.. చంద్రబాబు నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

by  |
హెరిటేజ్ నాదే.. చంద్రబాబు నన్ను మోసం చేశాడు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వీలుచిక్కినప్పుడల్లా టీడీపీ పై విమర్శలు చేస్తూ ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన ఏం మాట్లాడిన సంచలనమే. ముక్కుసాటిగా, నిజాన్ని నిక్కచ్చిగా చెప్తూ ఉంటారని టాలీవుడ్ లో మోహన్ బాబుకు ఒక పేరు ఉంది. ఇక తాజాగా ఆయన మరోసారి టీడీపీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు వ్యాఖ్యలు అటు టీడీపీ లోనూ, ఇటు ఇండస్ట్రీ లోను ప్రకంపనలు సృష్టిస్తోన్నాయి. తాజాగా మోహన్ బాబు ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గతంలోని రాజకీయ ఒడిదుడుకులను పంచుకున్నారు.

“నన్ను రాజకీయాలలోకి తీసుకొచ్చింది అన్న ఎన్టీఆర్. చంద్రబాబును పరిచయం చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు చంద్ర బాబు నాది అని చెప్పుకొంటున్న హెరిటేజ్ కంపెనీ వాస్తవంగా అయితే నాది. ఆ కంపెనీలో అధిక షేర్లు పెట్టింది నేను. అప్పట్లో నేను టీడీపీలో నుంచి బయటికి రావడానికి కారణం కూడా చంద్రబాబే.. నేను రాజకీయాలకు పనికిరానని చెప్పి తీసేశారు. అంతకుముందే మా అందరి షేర్లతో హెరిటేజ్ ఫుడ్ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవల మధ్య నేను ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డిగారు పాదయాత్రకి వెళ్లే ముందు మా ఇంటికి వచ్చారు. ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవ.. మీ ఇద్దరు ఫ్రెండ్స్ యే కదా అన్నారు. హెరిటేజ్ ఎలా మొదలయ్యింది..? నేను ఎంతపెట్టుబడి పెట్టాను..?.. ఎలా మోసపోయాను అన్ని చెప్పాను. చివరికి ఆయన సొంత మామనే మోసం చేసినవాడికి నిన్ను మోసం చేయడంలో వింతేముంది..? ” అని చెప్పుకొచ్చారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ మాటలు అటు రాజకీయాలలోను, ఇరు ఇండస్ట్రీలోని కలకలం రేపుతున్నాయి. ఇదంతా నిజం అయినప్పుడు ఇప్పటివరకు మోహన్ బాబు మౌనంగా ఎందుకు ఉన్నాడు..? హెరిటేజ్ ని సొంతం చేసుకోవడానికి ఎందుకు పోరాడలేదు..? ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు బయటపెట్టాడు అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాకుండా చాలా విషయాలను ఆయన పంచుకున్నారు. రాజకీయాలు, పిల్లలు, పెళ్లిళ్లు, దేవుడు ఇలా అనేక విషయాలపై మోహన్ బాబు ఓపెన్ అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన నటించిన సన్నాఫ్ ఇండియా విడుదలకు సిద్దమవుతుంది.

దూకుడు పెంచిన ఫైర్ బ్రాండ్ రోజా.. అదే జరిగితే ‘చంద్రబాబు’కు చుక్కలే.!

Next Story