వలస కార్మికులకు షమీ సాయం

by  |
వలస కార్మికులకు షమీ సాయం
X

దిశ, స్పోర్ట్స్: కాలి నడకన స్వస్థలాలకు వెళ్తున్న పలువురు కార్మికులు, కూలీలకు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సాయం చేస్తున్నాడు. తన స్వగ్రామమైన యూపీలోని సాహస్‌పూర్‌లో ఓ సహాయక శిబిరాన్ని ప్రారంభించి, ఆ దారిగుండా వెళ్తున్న వారికి మాస్క్‌లు, ఆహారం, మంచి నీరు అందిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో షమీ చేస్తున్న సాయానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరమితం అయ్యాననీ, కేంద్రం అనుమతులు ఇవ్వగానే తిరిగి శిక్షణ ప్రారంభిస్తానని షమీ చెప్పాడు. బౌలర్‌గా తిరిగి ఫిట్‌నెస్ సాధించడం చాలా ముఖ్యమని అన్నాడు.

Next Story

Most Viewed