కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్యకు సన్మానం

by  |
కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్యకు సన్మానం
X

నాగర్‌ కర్నూల్‌కు చెందిన 12మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్పణం మొగిలయ్యను సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇవాళ సన్మానించారు. మొగిలయ్య తన కుటుంబంతో కలిసి మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్‌ను కలిశారు. కిన్నెర వాయిద్యకళ‌కు తాము చేసిన సేవ గురించి మంత్రికి మొగిలయ్య వివరించారు. మొగిలయ్య పరిస్థితికి చలించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆయనకు ప్రత్యేక పెన్షన్‌ నెలకు 10వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ కళాకారుల సంక్షేమం కోసం గుర్తింపు కార్డులు, పెన్షన్‌లు, ఉద్యోగాలు కల్పించి సమాజంలో ఆత్మగౌరవంతో జీవించే విధంగా వారికి అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.

Next Story