మళ్లీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ మీటింగ్

by  |
మళ్లీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ మీటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో పలుమార్లు అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానుండటం చర్చనీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, పలు రాష్ట్రాలు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తు్న్న క్రమంలో సీఎంలతో మోదీ సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 17న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఈ సమావేశంలో పెరుగుతున్న కరోనా కేసుల అంశం గురించి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది . అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి పలు సూచనలు చేసే అవకాశమున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed