రాష్ట్రంలోకి దుష్టశక్తులు :ఎమ్మెల్సీ పురాణం

by  |
రాష్ట్రంలోకి దుష్టశక్తులు :ఎమ్మెల్సీ పురాణం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోకి కొన్ని దుష్టశక్తులు ప్రవేశించాయని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ అన్నారు. గురువారం తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ దర్శించుకున్నారు. దర్శనాననంతరం పురాణం సతీష్ కుమార్‌కు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్బంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోకి వచ్చిన కొన్ని దుష్టశక్తుల నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడాలని స్వామివారిని ప్రార్ధించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని మత తత్వశక్తులు మతఛాందస్తాన్ని నరనరాల్లోకి ఎక్కించుకొని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అనేది ఓ మహాశక్తి అని.. బీజేపీ నేతల ఈ విజయం శాశ్వతం కాదన్నారు.


Next Story

Most Viewed