ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి అవమానం..

by  |
ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి అవమానం..
X

దిశ, వెబ్‌డెస్క్
ఉపాధ్యయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. సోమవారం యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద టోల్ సిబ్బంది ఆయన కారును ఆపారు. తాను ఎమ్మెల్సీని అని నర్సిరెడ్డి ఐడీకార్డు చూపించగా ఎమ్మెల్సీలకు టోల్ మినహాయింపులేదని సిబ్బంది ఆయనతో అన్నట్టు తెలుస్తోంది. టోల్ చెల్లించాలని లేని యెడల గేట్ తెరవబోమని సిబ్బంది చెప్పడంతో నిరసనగా ఆయన రోడ్డుపైన బైఠాయించారు.దీంతో వాహనాలు నిలిచిపోవడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, ఎమ్మెల్సీ కారును వెళ్లనిచ్చారు.ఈ ఘటనపై నర్సిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Read also..

‘‘పట్టణ ప్రగతి’’ కౌంటర్‌గా ‘‘పట్నం గోస’’


Next Story

Most Viewed