దీక్షా దివస్ స్పూర్తితో రాష్ట్ర ప్రగతికి పునరంకితమవుతాం

by  |
దీక్షా దివస్ స్పూర్తితో రాష్ట్ర ప్రగతికి పునరంకితమవుతాం
X

దిశ, వెబ్‎డెస్క్: కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదకొండేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు. యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ పునాదులను కదిలించిన దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమై కేసీఆర్‌కు అండగా ఉండాలని ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed