ప్రజలకు వాస్తవాలను తెలిపేదే పత్రిక :జీవన్ రెడ్డి

by  |
ప్రజలకు వాస్తవాలను తెలిపేదే పత్రిక :జీవన్ రెడ్డి
X

దిశ, ధర్మపురి: ఉన్నది ఉన్నట్టు నిజాలను నిర్భయంగా రాసి వాస్తవాలను ప్రజలకు తెలిపేదే పత్రిక అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ధర్మపురి క్షేత్రంలో ఆదివారం దిశ దినపత్రిక క్యాలెండర్​ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు దిన పత్రికలను నమ్ముతారని.. కావున పత్రికలు రాష్ర్టంలో జరుగుతున్న పరిస్థితులను ఉన్నది ఉన్నట్లు రాసి ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. దిశ పత్రిక వాస్తవాలను రాస్తుందని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను నిర్బయంగా రాసి ప్రజలను జాగ్రత్త పర్చాల్సిన బాధ్యత పత్రికలపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​, మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్​, మాజీ ఎంపీపీ బెత్తపు లక్ష్మణ్​, కాంగ్రెస్ నాయకులు వేముల రాజు, సింహ రాజు ప్రసాద్​, రఫియోద్దిన్​, చిలుముల లక్ష్మణ్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed