ఓటమి భయంతోనే కేసీఆర్‌ రెండోసారి సభ

by  |
ఓటమి భయంతోనే కేసీఆర్‌ రెండోసారి సభ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే.. వైరస్ నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతోందని కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అంతేగాకుండా.. నాగార్జున సాగర్‌లో ఈనెల 14న కేసీఆర్‌ సభకు కలెక్టర్‌, ఎస్పీ అనుమతి ఇవ్వొద్దని సూచించారు. పక్క రాష్ట్రంలో కరోనా కారణంగా సీఎం సభ రద్దు చేసుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ ఓటమి భయంతో రెండోసారి సభ పెడుతున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌ సభ రద్దు చేసుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed