కౌంటింగ్​ టేబుళ్ల పెంపు.. 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్​

by  |
కౌంటింగ్​ టేబుళ్ల పెంపు.. 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్​ – రంగారెడ్డి – మహబూబ్​ నగర్​ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్​ టేబుళ్లను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 56 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తుండగా.. ఆలస్యమవుతున్న నేపథ్యంలో టేబుళ్ల సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో టేబుల్​ స్థానంలో రెండు టేబుళ్ల చొప్పున ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. రాత్రి 8 గంటల సమయానికి 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్​ పూర్తయింది. ఎలిమినేషన్​ అయిన 40 మంది అభ్యర్థుల ఓట్ల నుంచి టీఆర్​ఎస్​కు 163, బీజేపీకి 146, కాంగ్రెస్​కు 78, ప్రొఫెసర్​ నాగేశ్వర్​కు 91 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు చేర్చిన తర్వాత కూడా టీఆర్​ఎస్​ అభ్యర్థి వాణిదేవి సమీప బీజేపీ అభ్యర్థి రాంచందర్​ రావుపై 8,038 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.

అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు (రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి)

బీజేపీ–1,04,814
టీఆర్ఎస్​–1,12,852
నాగేశ్వర్​ –53,701
కాంగ్రెస్​– 31,632



Next Story

Most Viewed