ఎమ్మెల్సీ పట్నం పరామర్శ

by  |
patnam
X

దిశ, చేవెళ్ల: శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద వాగు ప్రవాహంలో కారుతో సహా గల్లంతై మృతి చెందిన వెంకటయ్య కుటుంబానికి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళవారం ఆయన స్వగ్రామమైన వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎన్కతల గ్రామంలో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటయ్య కుటుంబానికి తనవంతు గా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. వెంకటయ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహకారం అందే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed