నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌కు వినతి

by  |
నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌కు వినతి
X

దిశ, కుత్బుల్లాపూర్: మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బుధవారం కలిశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. బస్తీలు, కాలనీతో పాటు కొత్తగా ఏర్పడిన కాలనీల్లో తాగునీటి పైప్‌లైన్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ.41కోట్లను కేటాయించాలని కోరారు. 8 డివిజన్లతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ నిధులు ఉపయోగిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే విడుదల చేస్తామని తెలిపినట్లు చెప్పారు.



Next Story

Most Viewed