- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఆపిందా? అని ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వంశీ.. ‘చంద్రబాబు తనకు ఉన్న సమస్యలన్నింటినీ కులానికి రుద్దుతున్నాడని’ వల్లభనేని విమర్శించారు.
ఇదిలాఉండగా, సినీ హీరో రామ్ ఇటీవల ట్విట్టర్లో చేసిన వరుస వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే.. విజయవాడ రమేష్ ఆస్పత్రి వ్యవహారంపై ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను రామ్ చదివాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే కులం వాళ్లు చూడట్లేదా.. వేరే కులం వారిని తన సినిమాలు చూడొద్దని రామ్ను చెప్పమనండి’ అని వంశీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాగా, రమేష్ ఆస్పత్రి కేసులో హీరో రామ్ వ్యాఖ్యలపై ఇటీవల విజయవాడ డీసీపీ శ్రీనివాస్ కూడా ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.