అందరం కలిసి ఆనందంగా జరుపుకుందాం.. భారీగా తరలిరండి

by  |
MLA Sudheer Reddy
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్‌: వ‌రంగ‌ల్‌లో న‌వంబ‌ర్ 15న నిర్వహించ‌నున్న ‘విజ‌య‌గ‌ర్జన మహాస‌భ‌’కు ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ఎస్ నాయ‌కులు, కార్యక‌ర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘విజ‌యగ‌ర్జన మ‌హాస‌భ‌’ను పుర‌స్కరించుకొని బుధ‌వారం నాగోల్‌లోని అనంతుల రాంరెడ్డి గార్డెన్‌లో ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ విస్తృతస్థాయి కార్యక‌ర్తల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఎమ్మెల్సీ బోగార‌పు ద‌యానంద్‌, టీఎస్ ఐఐసీ చైర్మన్ అమ‌ర‌వాది ల‌క్ష్మీనార‌య‌ణలతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. వ‌చ్చే నెల 15న వ‌రంగ‌ల్‌లో జ‌రిగే విజ‌య‌గ‌ర్జన మహాస‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తైన సంద‌ర్భంగా ద్విద‌శాబ్ది ఉత్సవాల్లో అంద‌రం పాల్గొని ఆనందంగా జ‌రుపుకోవాల‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అన్ని డివిజ‌న్లకు సంబంధించిన పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, ఉద్యమ‌కారులు, అనుబంధ‌క‌మిటీ స‌భ్యులు, మార్కెట్ క‌మిటీ స‌భ్యులు, ప‌లు దేవాల‌య క‌మిటీల చైర్మెన్‌లు, మాజీ చైర్మెన్‌లు, ధ‌ర్మక‌ర్తలు, డివిజ‌న్ల సోష‌ల్ మీడియా అధ్యక్షులు, మాజీ వార్డు, ఏరియా క‌మిటీ స‌భ్యులు, నాయ‌కులు, కార్యక‌ర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story

Most Viewed