వరంగల్ అన్నదాతలకు శుభవార్త!

by  |
MLA-Sudharshan-Reddy1
X

దిశ, నర్సంపేట టౌన్: తుది దశలో ఉన్న రామప్ప – పాకాల చెరువు ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ప్రాజెక్టులు కూడా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నాయని, త్వరలోనే ప్రారంభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పైలాన్ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన క్షేత్ర స్థాయిలో పనులు ముగింపు దశలో ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టుతో రైతుల నీళ్ల కష్టాలు తీరుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.



Next Story

Most Viewed