ఆ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండండి.. ఎమ్మెల్యే

by  |
cancer
X

దిశ, కంటోన్మెంట్: రసూల్ పురా అన్నానగర్‌లోని స్వస్థవ కాన్సర్ కేర్ సహకారంతో ఏర్పాటు చేసిన ‘క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరాన్ని’ శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న ప్రాంభించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర సర్కారు చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. ఇటీవల కాలంలో క్యాన్సర్ మహామ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తుందని, ముందుగా గుర్తించి సరైన చికిత్స చేయించుకుంటే క్యాన్సర్‌ను జయించవచ్చునని తెలిపారు. ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యుడు ప్రభాకర్, మార్కెట్ మాజీ చైర్మన్ టి.ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed