వారి వల్లే నాకు ప్రాణహాని : ఎమ్మెల్యే శ్రీదేవి

by  |
వారి వల్లే నాకు ప్రాణహాని : ఎమ్మెల్యే శ్రీదేవి
X

దిశ, వెబ్‎డెస్క్: తనకు ప్రాణహని ఉందంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శృంగారపాటి సందీప్, చలివేంద్రపు సురేష్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇటీవలే సందీప్, సురేష్ పేకాట క్లబ్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో మండల పార్టీ నాయకులు వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించారు.



Next Story

Most Viewed