దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం: సోలిపేట రామలింగారెడ్డి

by  |
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం: సోలిపేట రామలింగారెడ్డి
X

దిశ, మెదక్: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలం అల్వాల్, మోతె, భూంపల్లి గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన రైతుల కుటుంబాలకు శనివారం రైతు బీమా పత్రాలను అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం హర్షణీయం అన్నారు. కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించాలన్నారు. పెళ్లి కార్యక్రమాల్లో తక్కువ మంది బంధువులు ఉండేలా చూసుకోవాలన్నారు.

Next Story

Most Viewed