దివంగత నేత వైఎస్ఆర్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే సీతక్క

by  |
దివంగత నేత వైఎస్ఆర్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే సీతక్క
X

దిశ,ములుగు: దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకొని ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) గురువారం జిల్లా కేంద్రంలో నివాళులు అర్పించారు. క్యాంప్ కార్యాలయం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్ పర్సన్ కూచన రవళి రెడ్డి, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, ములుగు కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్ల పల్లి రాజేందర్ గౌడ్, ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు బానోతు రవి చందర్, ములుగు జిల్లా మత్స్య పారిశ్రామిక కాంగ్రెస్ అధ్యక్షులు కంబాల రవి, ములుగు ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి, ములుగు మైనారిటీ నాయకులు షకీల్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Next Story