అత్యాచారాన్ని ఎంజాయ్ చేయాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

by  |
congress
X

దిశ, వెబ్‌డెస్క్ : అత్యాచారం ఘటనలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క‌ర్ణాట‌క అసెంబ్లీ‌ సమావేశాలు జరుగుతున్నాయి. అత్యాచార ఘ‌ట‌నల పై చర్చ జ‌రుగుతున్న సంద‌ర్భంలో కాంగ్రెస్ పార్టీ‌కి చెందిన ఎమ్మెల్యే ర‌మేష్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం అనివార్యం అయిన స‌మ‌యాల్లో, దానిని మ‌హిళ‌లు ఆనందించాల‌ని ఎమ్మెల్యే ర‌మేష్ కుమార్ అన్నారు. దీంతో అతనిపై తన పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అలా అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మహిళా నాయకులు ఎమ్మెల్యేని నిలదీశారు. అంతే కాకుండా మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లడటంతో అసెంబ్లీల పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమెల్యే ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని సొంత పార్టీ మ‌హిళా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అలాగే అత‌నిపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ కర్ణాట‌క చీఫ్‌కు తెలిపారు.

Next Story

Most Viewed