పారిశుద్ధ్య కార్మికులను అభినందించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

by  |
MLA-Shanker-Naik
X

దిశ, మహబూబాబాద్ టౌన్: కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు కృషి చేశారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ ఆధ్వర్యంలో అందించిన దుప్పట్లను సుమారు 50మంది మున్సిపల్ కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. దాతల సహకారంతో 40 వేల రూపాయల దుప్పట్లు మున్సిపాలిటీ కార్మికులకు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నేలవంచ, దొరవారి తిమ్మాపురం గ్రామాలలో వెనకబడినవారికి ఆర్థిక చేయూత, మున్సిపల్ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేస్తున్న కాళోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డా. డోలి సత్యనారాయణ, అధ్యక్షులు నామిరెడ్డి వెంకటరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, చిట్యాల జనార్దన్, బుజ్జి వెంకన్న, మైస శ్రీనివాస్, మైస నాగయ్య, పెద్ది వెంకన్న, గోగుల రాజు, మార్నేని రఘు, ఆరుద్ర పరమాత్మ చారి, పట్టాభి లక్ష్మయ్య, విష్ణువర్ధన్, హట్యానాయక్, మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed