బోధన్ ఎమ్మెల్యే షకిల్ తండ్రి మృతి

by  |
బోధన్ ఎమ్మెల్యే షకిల్ తండ్రి మృతి
X

దిశ, నిజామాబాద్ : బోధన్ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ ఆమేర్ తండ్రి మహ్మద్ అజామ్(70) అనారోగ్యంతో మృతి చెందారు. అయన గత కొంత కాలం క్రితం కరోనా బారిన పడి ఆరోగ్యం బాగా లేనందున హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం మృతి చెందారు.తండ్రి అజామ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన కొన్ని రోజులకే ఎమ్మెల్యే షకిల్ సైతం కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి హైదరాబాద్ కే పరిమితమై క్వారంటైన్ లో ఉండి కోలుకోని, తండ్రి ఆరోగ్య బాగోగులను చూసుకుంటున్నారు. బోధన్ శక్కర్ నగర్ కు చెందిన మహ్మద్ అజామ్ విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయులు. అతడికి బోధన్ ఎమ్మెల్యే షకిల్ తో పాటు సోహైల్ అనే కొడుకు ఉండగా అతడు ప్రస్తుతం బోధన్ మున్సిపల్ వైస్ చైర్మెన్ గా పనిచేస్తున్నారు. బోధన్ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ ఆమేర్ తండ్రి మహ్మద్ అజామ్ మరణం పట్ల అతనికి, కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, ప్రజలు సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed