కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ

by  |
కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ
X

దిశ, వరంగల్: లాక్ డౌన్ సందర్భంగా కూలి పని చేసుకుని జీవనం సాగించే 200 కుటుంబాలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల లాక్ డౌన్ విధించాయని తెలిపారు. ప్రజలందరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండి కరోనా మహమ్మారిని దేశం నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి పాల్గొన్నారు.

Tags: MLA seethakka, essential goods, labourers, lockdown, curfew, corona, virus,



Next Story

Most Viewed