‘ఆ ఘటనలో… చంద్రబాబు ప్రమేయం ఉంది’

by  |
MLA Roja
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… అంతర్వేది రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపించారు. అంతేగాకుండా గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగలబెట్టిన ఘనత చంద్రబాబుకు ఉందని విమర్శించారు. గతంలో సీబీఐని రాష్ట్రానికి రావొద్దని జీవో ఇచ్చిన చంద్రబాబే.. నేడు సీబీఐ విచారణ కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా ఇందులో భాగంగానే తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సీఎం జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారని అన్నారు.

Next Story

Most Viewed