‘గోదావరి జలాలతో సస్యశ్యామలం’

by  |
‘గోదావరి జలాలతో సస్యశ్యామలం’
X

దిశ, మెదక్: గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. అంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్ జలాల విడుదలతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం, కల్లెపల్లి గ్రామాల చెరువులు నిండాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చెరువులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గోదావరి జలాలతో తెలంగాణలో ఇక సిరులు పండుతాయన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణాంలో ఇది ఒక భాగమన్నారు.

Next Story

Most Viewed